'సీమాంధ్ర మంత్రుల్లో అభిప్రాయ భేదాలు లేవు' | No differences in Seemandhra ministers: Rudraraju Padmaraju | Sakshi
Sakshi News home page

'సీమాంధ్ర మంత్రుల్లో అభిప్రాయ భేదాలు లేవు'

Oct 2 2013 1:13 PM | Updated on Sep 1 2017 11:17 PM

సమైక్య రాష్ట్ర ఉద్యమ తీవ్రతను తెలుసుకునేందుకు కేంద్ర కమిటీ రాష్ట్రానికి రావాలని సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ : సమైక్య రాష్ట్ర ఉద్యమ తీవ్రతను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ కమిటీ రాష్ట్రానికి రావాలని సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే అంశంపై సీమాంధ్ర మంత్రుల్లో అభిప్రాయ భేధాలు లేవని  ప్రభుత్వ విప్‌ పద్మరాజు అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే అంశంపై తాజా రాజకీయ పరిణామాలను  చర్చించుకుని భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకునేందుకు గురువారం సీమాంధ్ర కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు సమావేశం కానున్నట్లు తెలిపారు. మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో  రేపు ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో సీమాంధ్ర మంత్రులు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని పద్మరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement