వైఎంహెచ్‌ఏ అభివృద్ధికి కృషి చేస్తా: ఆళ్ల నాని | Minister Alla Nani Participated Awards Program In Eluru | Sakshi
Sakshi News home page

 వైఎంహెచ్‌ఏ అభివృద్ధికి కృషి చేస్తా: ఆళ్ల నాని

Sep 26 2019 9:59 PM | Updated on Sep 26 2019 10:25 PM

Minister Alla Nani Participated Awards Program In Eluru - Sakshi

సాక్షి, ఏలూరు: వైఎంహెచ్‌ఏ హాలు అభివృద్ధికి కృషి చేస్తానని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు. ఏలూరు వైఎంహెచ్‌ఏ హాలులో గురువారం కేవీఎస్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డు బహుకరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేవీఎస్‌ లాంటి వ్యక్తి ఏలూరులో ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు. దేశ విదేశాల్లో కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పేరు ప్రఖ్యాతలను సంపాందించిన కేవీఎస్‌ను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికార భాషా సంఘం ఛైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధ ప్రసాద్‌, ఉష గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ డాక్టర్‌ వివి బాలకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement