పుష్కర భక్తులకు మిల్లర్ల ఉచిత భోజనం | Miller free meals to the devotees of Pushkarni | Sakshi
Sakshi News home page

పుష్కర భక్తులకు మిల్లర్ల ఉచిత భోజనం

Jul 24 2016 4:04 AM | Updated on Sep 4 2017 5:54 AM

పుష్కర భక్తులకు మిల్లర్ల ఉచిత భోజనం

పుష్కర భక్తులకు మిల్లర్ల ఉచిత భోజనం

పుష్కరాల్లో భక్తులకు భోజనాలు ఏర్పాటుకు మిల్లర్లు ముందుకు వచ్చారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు.

సాక్షి, అమరావతి : పుష్కరాల్లో భక్తులకు భోజనాలు ఏర్పాటుకు మిల్లర్లు ముందుకు వచ్చారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు. గుంటూరులో శనివారం  ఆమె విలేకర్లతో మాట్లాడారు. అమరావతిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు రోజుకు 12 వేలమందికి ఐదు కూరలు, రెండు స్వీట్లతో భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం  నీరు, విద్యుత్తు, షెడ్డు, వంటగ్యాస్ వంటి సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ఇప్పటికే 1.36 లక్షల మందికి భోజనాలు, మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు సరఫరాకు దాతలు ముందుకు వచ్చారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement