సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు యాతన పడాల్సిన దుస్థితి లేకుండా చేయాల్సిన మార్క్ఫెడ్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్సీజన్లోనూ ఎరువులు కొని, నిల్వ ఉంచి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అప్పట్లో మార్క్ఫెడ్ను రంగంలోకి దించింది. అయితే, ప్రస్తుతం మార్క్ఫెడ్ ఈ లక్ష్యానికి నీళ్లొదిలి, ఫక్తు వ్యాపార సంస్థలా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్క్ఫెడ్ వ్యవహార సరళి ఇలాగే ఉంటే రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను సరఫరా చేయడం తమ వల్ల కాదని క్రిభ్కో, ఇఫ్కో వంటి సహకార సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.
మార్క్ఫెడ్కు సగం ఎరువులు
రాష్ట్రానికి సరఫరా చేసే ఎరువుల్లో సగభాగాన్ని క్రి భ్కో, ఇఫ్కోలు తప్పనిసరిగా మార్క్ఫెడ్కు అమ్మాలన్న నిబంధన ఉంది. ఖరీఫ్ సీజన్లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో.. రబీలో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిల్లో ఎరువులకు గిరాకీ ఉంటుంది. ఈ నెలల్లో మాత్రం మార్క్ఫెడ్ పట్టుబట్టి తన వాటా కొనుగోలు చేస్తోంది. అంతగా గిరాకీ ఉండని ఇతర నెలల్లో సాకులు చూపుతూ మార్క్ఫెడ్ కొనకపోవడం వల్ల తాము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని క్రిభ్కో, ఇఫ్కో తదితర సంస్థలు వాపోతున్నాయి. అక్టోబర్లో క్రిభ్కో 24 వేల టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉంది. ఇందులో 12 వేల టన్నులను మార్క్ఫెడ్ కొనాలి. తీరా ఓడరేవుల్లోకి వచ్చాక అన్సీజన్ పేరుతో మార్క్ఫెడ్ యూరియా కొనుగోలు చేయకపోతే ఆ సరకును ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఇబ్బంది పడాల్సి వస్తోందని క్రిభ్కో అధికారులు వాపోతున్నారు. సీజన్లో సగం ఎరువులు మార్క్ఫెడ్కు విక్రయించి తీరాలని మాపై ఒత్తిడి తెచ్చే వ్యవసాయ శాఖ, అన్సీజన్లోనూ సగం ఎరువులను కొనాల్సిందేనని మార్క్ఫెడ్పై మాత్రం వత్తిడి చేయడం లేదు. దీనివల్ల ఖర్చులు రెట్టింపై క్రిభ్కో, ఇఫ్కో తదితర సంస్థలు నష్టపోవాల్సి వస్తోంది.
రూ. 500 కోట్ల రుణం ఇప్పించిన వైఎస్సార్
అన్సీజన్లో ఎరువులను కొనుగోలు చేసి, జిల్లా స్థాయిలో ఎరువుల నిల్వలు ఉంచి, ఏ నెలలోనూ ఎరువుల కొరత లేకుండా చేయాలన్న ఉదాత్త లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో మార్క్ఫెడ్ను రంగంలోకి దించారు. అందుకోసం ప్రభుత్వ పూచీతో మార్క్ఫెడ్కు రూ.500 కోట్ల వడ్డీలేని రుణాన్ని సయితం వైఎస్సార్ ఇప్పించారు. ఈ రుణంపై వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాకుండా ఎరువుల నిల్వ, రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించేలా నిబంధనలు రూపొందించారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మార్క్ఫెడ్ కూడా సీజన్లో మాత్రమే ఎరువులు కొంటూ ఫక్తు వ్యాపార సంస్థలా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. అయితే, తమ వద్ద ఇప్పటికే దాదాపు 3 లక్షల టన్నుల ఎరువుల నిల్వలు పేరుకు పోయాయని మార్క్ఫెడ్ జనరల్ మేనేజర్ ఆదినారాయణ ‘సాక్షి’కి తెలిపారు. అదీకాక తమకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.157 కోట్ల బకాయిలు వసూలు కానందున మార్క్ఫెడ్ ఎరువులు కొనలేని పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు.
ఎరువుల కొనుగోళ్లలో ఇష్టారాజ్యం!
Published Thu, Oct 17 2013 3:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement