‘మద్యం అమ్మకాల్లో కాంగ్రెస్, టీడీపీ ఒక్కటే’ | lcohol sales in the Congress, the TDP was the only' | Sakshi
Sakshi News home page

‘మద్యం అమ్మకాల్లో కాంగ్రెస్, టీడీపీ ఒక్కటే’

Jun 25 2014 2:15 AM | Updated on Mar 18 2019 9:02 PM

రాష్ట్రంలోని మద్యం అమ్మకాల్లో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఒకే విధానాన్ని అమలు చేస్తున్నాయని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీషెట్టి బాబ్జీ అన్నారు.

గజపతినగరం రూరల్: రాష్ట్రంలోని మద్యం అమ్మకాల్లో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఒకే విధానాన్ని అమలు చేస్తున్నాయని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీషెట్టి బాబ్జీ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మద్యం అమ్మకాల విధానంలో కాం గ్రెస్, టీడీపీ ప్రభుత్వాలకు ఎటువంటి తేడా లేదన్నారు. తమిళనాడు తరహాలో మద్యం అమ్మకాలు చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట తప్పి లాటరీ పద్ధతి చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొత్త పాలసీ ద్వారా మద్యం అమ్మకాలు చేపట్టడానికి సమయం చాలకపోతే ఇప్పుడున్న పాలసీని కొద్ది రోజులు పొడిగించి, తరువాత కొత్త పాలసీ అమలు చేయవచ్చున న్నారు. కానీ అవేవీ కాకుండా ప్రభుత్వం రాష్ట్రంలోని 4380 మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఇందులో 2300 మద్యం దుకాణాలకు లెసైన్స్ ఫీజు పెంచారని విమర్శించా రు. ఆయనతో పాటు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దేవర ఈశ్వర రావు, గజపతినగరం, బొండపల్లి మండలాల పార్టీ అధ్యక్షులు ఆరిశెట్టి రామకృష్ణ, ఎంఎస్‌ఎన్ రాజు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement