సీఎం మిత్రునికి అక్రమంగా భూమి కేటాయింపు | Kiran kumar reddy's government given HMDA land allocation illegally: Telangana lawyers JAC | Sakshi
Sakshi News home page

సీఎం మిత్రునికి అక్రమంగా భూమి కేటాయింపు

Nov 23 2013 2:19 AM | Updated on Jul 29 2019 5:31 PM

హెచ్‌ఎండీఏకి చెందిన విలువైన భూములను అధికార యంత్రాంగం సీఎం కిరణ్ ఒత్తిడికి తలొగ్గి ఆయన మిత్రుడు అమరేందర్‌రెడ్డికి కారుచౌకగా కట్టబెట్టిందని ఆరోపిస్తూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ లోకాయుక్తను ఆశ్రయించింది.

 సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎండీఏకి చెందిన విలువైన భూములను అధికార యంత్రాంగం సీఎం కిరణ్ ఒత్తిడికి తలొగ్గి ఆయన మిత్రుడు అమరేందర్‌రెడ్డికి కారుచౌకగా కట్టబెట్టిందని ఆరోపిస్తూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ లోకాయుక్తను ఆశ్రయించింది. ఈ మేరకు జేఏసీ కోకన్వీనర్ శ్రీరంగారావు నేతృత్వంలో ప్రతినిధి బృందం శుక్రవారం లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. నందగిరిహిల్స్‌లో 4 ఎకరాల ఆరు గుంటల విలువైన భూమిని రూ.84.74 కోట్లకే అమరేందర్‌రెడ్డికి కట్టబెట్టారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చేందుకు బాధ్యులైన అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని వారు కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement