చంద్రబాబు, కేసీఆర్ ఆత్మీయ ఆలింగనం | Kcr hugs Chandrababu naidu at Alai Balai | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, కేసీఆర్ ఆత్మీయ ఆలింగనం

Oct 5 2014 2:20 PM | Updated on Aug 15 2018 9:22 PM

చంద్రబాబు, కేసీఆర్ ఆత్మీయ ఆలింగనం - Sakshi

చంద్రబాబు, కేసీఆర్ ఆత్మీయ ఆలింగనం

అలయ్-బలయ్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలుసుకున్నారు.

హైదరాబాద్: ఇద్దరు చంద్రులు మళ్లీ కలిశారు. బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్-బలయ్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కలుసుకున్నారు. పరస్పరం ఆలింగనం చేసుకున్నారు.

కేసీఆర్ కొద్దిగా తటపటాయించినా దత్తాత్రేయ చొరవతో ముఖ్యమంత్రులిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. గర్నవర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement