తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గురువారం స్వర్ణ వర్తకులు బంద్ పాటించారు.
రాజమండ్రిలో నగల దుకాణాల బంద్
Jan 21 2016 12:58 PM | Updated on Aug 21 2018 7:39 PM
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గురువారం స్వర్ణ వర్తకులు బంద్ పాటించారు. వినోద్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం పోలీస్స్టేషన్ భవనంపై నుంచి కిందికి దూకేశాడు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. దీనిపై స్వర్ణ వర్తకులు కోటగుమ్మం నుంచి డీలక్స్ సెంటర్ వరకు ర్యాలీగా తరలివెళ్లారు. అక్కడ మానవహారంగా ఏర్పడి పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల వేధింపుల వల్లే కదం వినోద్ చనిపోయాడంటూ బంద్ పాటించారు.
Advertisement
Advertisement