రాజమండ్రిలో నగల దుకాణాల బంద్ | jewelry stores bandh in rajahmundry | Sakshi
Sakshi News home page

రాజమండ్రిలో నగల దుకాణాల బంద్

Jan 21 2016 12:58 PM | Updated on Aug 21 2018 7:39 PM

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గురువారం స్వర్ణ వర్తకులు బంద్ పాటించారు.

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గురువారం స్వర్ణ వర్తకులు బంద్ పాటించారు. వినోద్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం పోలీస్‌స్టేషన్ భవనంపై నుంచి కిందికి దూకేశాడు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. దీనిపై స్వర్ణ వర్తకులు కోటగుమ్మం నుంచి డీలక్స్ సెంటర్ వరకు ర్యాలీగా తరలివెళ్లారు. అక్కడ మానవహారంగా ఏర్పడి పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల వేధింపుల వల్లే కదం వినోద్ చనిపోయాడంటూ బంద్ పాటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement