‘నిట్’లోని తెలుగు విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన
మరోచోట సీటు ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో తెలుగు విద్యార్థులకు భద్రత లేదంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డలను అక్కడినుంచి బయటకు తీసుకురావడంతోపాటు మరో నిట్లో సీటు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు మణిపూర్ రాజధాని ఇంఫాల్లోని ఉన్న నిట్కు సంబంధించిన టక్యాల్పట్, లాంగోల్ క్యాంపస్లలో చదువుతున్నారు. లాంగోల్లో ఉన్న దాదాపు 20 మంది తెలుగు విద్యార్థులపై మూడు రోజులపాటు వరుసదాడులు జరిగిన సంగతి తెలిసిందే.
తమ పిల్లల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మణిపూర్లోని నిట్లో విద్యనభ్యసిస్తున్న మహబూబ్నగర్, మెదక్ జిల్లాలకు చెందిన బీటెక్ విద్యార్థులు రవితేజ యాదవ్, సాయిచరణ్ల తండ్రులు లక్ష్మీనారాయణ యాదవ్, శ్రీనివాస్ సోమవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. తమ పిల్లలకు మణిపూర్లో భద్రత లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులు చేసిన వరుసదాడుల్ని పరిగణనలోకి తీసుకుంటూ ఇక్కడి ప్రభుత్వం బాధ్యత తీసుకుని తమ పిల్లల్ని మణిపూర్ నిట్ నుంచి బయటకు తీసుకురావడంతోపాటు మరో నిట్లో సీట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు.
బాసటగా నిలిచిన ఏబీవీపీ
మరోవైపు మణిపూర్ నిట్లోని తెలుగు విద్యార్థులకు అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) అండగా నిలిచింది. సంస్థకు చెందిన పలువురు నాయకులు సోమవారం స్వయంగా నిట్ క్యాంపస్లకు చేరుకుని తెలుగు విద్యార్థులకు ధైర్యం చెప్తూ మేమున్నామనే భరోసా ఇచ్చారు.
మణిపూర్లో మా బిడ్డలకు భద్రతలేదు
Published Tue, Sep 16 2014 12:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement