ధర్మవరంలో జననేతకు అపూర్వస్వాగతం | huge crowd welcomes YS Jagan at Dharmavaram | Sakshi
Sakshi News home page

ధర్మవరంలో జననేతకు అపూర్వస్వాగతం

Oct 17 2017 5:23 PM | Updated on Jul 25 2018 4:50 PM

huge crowd welcomes YS Jagan at Dharmavaram - Sakshi

సాక్షి, ధర్మవరం : ముడిపట్టు రాయితీ బకాయిల కోసం 37 రోజులుగా దీక్షలు చేస్తోన్న చేనేత కార్మికులకు సంఘీభావం తెలిపేందుకుగానూ అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీక్షా ప్రాంగాణానికి వెళ్లే దారులన్నీ లక్షల సంఖ్యలోని జనంతో కిక్కిరిపోయాయి.

జనసందోహానికి అభివందనం చేస్తూ వైఎస్‌ జగన్‌ ర్యాలీగా దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. 37 రోజులుగా దీక్షలో కూర్చున్న మహిళా చేనేత కార్మికులతో ఆయన మాట్లాడారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

 ధర్మవరంలో వైఎస్‌ జగన్‌‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు 

Advertisement
 
Advertisement
Advertisement