శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు
సాక్షి, తిరుమల: ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ చల్లా కోదండరామ్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో వారు వేర్వేరుగా ఆలయానికి వచ్చారు. ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ వారికి ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు.