కరెంట్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి | Government must pay electricity bills | Sakshi
Sakshi News home page

కరెంట్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి

Sep 5 2013 4:02 AM | Updated on Sep 5 2018 3:44 PM

అన్ని మేజర్, మైనర్ గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం డిమాండ్ చేసింది.

అన్ని మేజర్,  మైనర్ గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం డిమాండ్ చేసింది.  విద్యుత్ ఛార్జీలు చెల్లించాలంటూ విద్యుత్ సంస్థలు ఇటీవలి కాలంలో పంచాయతీలకు నోటీసులు ఇస్తున్నాయని, అరుుతే, ఆర్థికంగా పూర్తిగా కుంగిపోయిన పంచాయతీలు ఆ ఛార్జీలను చెల్లించే స్థితిలో లేవని సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు డోకూరి రామ్మోహన్‌రావు, గౌరవాధ్యక్షుడు పిల్లి సత్తిరాజు, ప్రధాన కార్యదర్శి భూమన్నయాదవ్ తదితరులు బుధవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement