సాగర్ కుడి ఆయకట్టుకు గోదావరి జలాలు: సీఎం
సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో నీటి లభ్యత తగ్గిన నేపథ్యంలో గోదావరి జలాలను తరలించి నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు నీళ్లందిస్తామని సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ప్రతిపాదనలపై సీఎంకు అధికారులు వివరించారు.
వీర్రాజు దిష్టిబొమ్మలు తగలబెట్టొద్దు
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు దిష్టిబొమ్మలు తగలబెట్టవద్దని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ఆదేశించారు. తనపై సోము వీర్రాజు చేసిన ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేయాలని సూచించారు.