సీఎం జగన్‌తో పాక్సికన్‌ ఇండియ ఎండీ భేటీ | Foxconn India MD Josh Foulger Met AP CM YS Jagan At Secretariat | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌తో పాక్సికన్‌ ఇండియ ఎండీ భేటీ

Sep 17 2019 5:44 PM | Updated on Sep 17 2019 6:04 PM

Foxconn India MD Josh Foulger Met AP CM YS Jagan At Secretariat - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం సచివాలయంలో  ఫాక్సికన్‌ ఇండియా ఎండీ జోష్‌ ఫాల్గర్‌ కలిశారు. ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాలను ముఖ్యమంత్రికి వివరించిన ఫాల్గర్, నెల్లూరు జిల్లా శ్రీ సిటీలో ఉన్న కంపెనీ ద్వారా దాదాపు 15 వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. వారందరికి వృత్తిపరమైన శిక్షణ కూడా ఇచ్చామని చెప్పారు. అదే విధంగా కంపెనీ ఉత్పాదక సామర్థ్యం కూడా పెంచబోతున్నామన్న జోష్‌ ఫాల్గర్‌ , ప్రస్తుతం నెలకు 35 లక్షల సెల్‌ఫోన్లు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. 

కాగా, ఎలక్ట్రానిక్‌ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్‌ హబ్‌గా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. పెట్టుబడులకు రాష్ట్రం అన్ని విధాల అనుకూల ప్రాంతమన్న ముఖ్యమంత్రి, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ఉత్తమ నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేయడానికి అత్యుత్తమ ప్రమాణాలతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే దీని ఉద్దేశమన్న సీఎం జగన్, ఆ దిశలో ఫాక్సికన్‌ కంపెనీ కూడా ముందుడుగు వేయాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement