ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాల య్యాయి.
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాల య్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలోని వ్యవసాయ మార్కెట్ ఎదురుగా సోమవారం చోటుచేసుకుంది. 65వ నెంబర్ జాతీయ రహదారిపై నుంచి సర్వీస్ రోడ్డులోకి వస్తున్న బస్సును వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాల య్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.