పెనుమాకలో రైతుల ఆగ్రహం | farmers angry on CRDA meeting in amaravathi | Sakshi
Sakshi News home page

పెనుమాకలో రైతుల ఆగ్రహం

Jun 27 2017 1:54 PM | Updated on Oct 30 2018 4:08 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత రైతులు మరోసారి కన్నెర్ర చేశారు. మంగళవారం పెనుమాక రైతులతో సీఆర్‌డీఏ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత రైతులు మరోసారి కన్నెర్ర చేశారు. మంగళవారం పెనుమాక రైతులతో సీఆర్‌డీఏ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. అధికారుల తీరుకు నిరసనగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  సమావేశంలో కుర్చీలు విసిరేసి... అధికారులతో వాగ్వాదానికి దిగారు. పెనుమాక భూసేకరణ, రైతులు ఇచ్చిన అభ్యంతరాలపై అధికారులు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

అయితే రైతుల అభ్యంతరాలను సీఆర్‌డీఏ అధికారులు నమోదు చేయలేదు. దీంతో వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డితోపాటు రైతులు అధికారుల తీరును తప్పుబట్టారు. అభ్యంతరాలు నమోదు చేయాలని పట్టుబట్టినప్పటికీ, అధికారులు మాత్రం ససేమిరా అనడంతో రైతులు ఆగ్రహించారు. టెంట్లు పడేసి.. కుర్చీలు విసిరేశారు. దీంతో సమావేశం కాస్తా ఉద్రిక్తంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement