ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొని దేశ భవిష్యత్తును నిర్ణయించాలి
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా
సాక్షి, హైదరాబాద్: ఓటర్లు పాలకుల సామర్థ్యాన్ని అంచనా వేసి ఓటు వేయాలని, ప్రతి పౌరుడూ తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జస్టిస్ గుప్తా ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం దేశంపై ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని... పోలింగ్లో పాల్గొని దేశ భవిష్యత్తును నిర్ణయించే బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. రాజ్యాంగం నిర్దేశించిన మేరకు పోలింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుతంగా జరగాలని... అందుకు ప్రతి పౌరుడూ కృషి చేయాలని సూచించారు. ప్రతి సార్వత్రిక ఎన్నిక ఒక కొత్త ప్రభుత్వానికి జన్మనిస్తోందని, ఎన్నికల సంఘం ఇందుకు ప్రసూతి కేంద్రంగా పనిచేస్తోందని కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు. అలాగే కొత్త ఓటరు గుర్తింపు కార్డులను కొందరికి అందజేశారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్కుమార్, కంటోన్మెంట్ బోర్డు సీఈవో సుజాతాగుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఎవరేమన్నారు...
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీఎస్ మహంతి: రాష్ట్రవ్యాప్తంగా 4,800 ఈ-సేవా కేంద్రాల ద్వారా ఓటరు గుర్తింపు కార్డులు జారీచేస్తున్నాం. ఓటర్లందరికీ గుర్తింపు కార్డులు అందేలా చర్యలు తీసుకుంటాం. ఓటరుగా నమోదైన వారు వారి పేర్లను జాబితాలో చెక్ చేసుకోవాలి. ఈ నెలాఖరు నాటికి ఓటర్ల జాబితాను ముద్రిస్తాం.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్రెడ్డి: 18 ఏళ్లు నిండిన వారు ఎప్పుడైనా ఓటరుగా రిజిస్ట్రర్ చేసుకోవచ్చు, ఇందుకు ఆఖరు తేదీ ఉండదు.
ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్: ఇటీవల కాలంలో రికార్డు స్థాయిలో 76 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో యువత ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 6.24 కోట్లకు చేరింది. గత ఏడాది 54 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. ఈ ఏడాది 100 శాతం పోలింగ్ జరిగేలా అందరూ కృషి చేయాలి.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్: జంట నగరాల పరిధిలో ఐదు లక్షల మంది కొత్తగా ఓటర్లుగా రిజిస్టర్ చేసుకున్నారు. ప్రతి ఓటరు ఓటు వేసేలా చైతన్యపరచాల్సిన అవసరం ఉంది.
Breadcrumb
Related news
-
మరియమ్మ లాకప్డెత్పై తెలంగాణ హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్ : మరియమ్మ లాకప్డెత్ కేసుపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. మరియమ్మ మృతదేహానికి గత నెలలో రీపోస్ట్మార్టమ్ పూర్తైందని ఏజీ తెలిపారు. కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం, ఉద్యోగం ఇచ్చినట్లు తెలియజేశారు. ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో దేశంలో ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోయిన ప్రాణాలు పరిహారంతో తిరిగి వస్తాయా అని ప్రశ్నించింది. ఆలేరు మేజిస్ట్రేట్ నివేదిక అందిన తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది. నివేదిక అందిన 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. మరియమ్మ లాకప్ డెత్పై విచారణ సెప్టెంబర్ 15కి వాయిదా వేసింది. -
పోలీస్స్టేషన్లో సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు?
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ అడ్డగూడూరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన దళిత మహిళ మరియమ్మ లాకప్డెత్ ఘటనపై న్యాయమూర్తితో విచారణ చేయించకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. పోలీసు కస్టడీలో మహిళ చనిపోతే నేర విచారణచట్టం (సీఆర్పీసీ)సెక్షన్ 176(1)(ఎ) ప్రకారం స్థానిక న్యాయమూర్తితో విచారణ జరిపించాలని స్పష్టంగా ఉన్నా.. ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నిబంధన గురించి సంబంధిత అధికారులకు తెలియదా అంటూ నిలదీసింది. ఈ ఘటనపై ఆలేరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ను విచారణ జరపాలని ఆదేశించింది. ఈ నివేదికను నెల రోజుల్లోపు సీల్డ్ కవర్లో సమర్పించాలని పేర్కొంది. అవసరమైతే మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని కూడా మేజిస్ట్రేట్ ఆదేశించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ టి.వినోద్కుమార్లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. లాకప్డెత్ ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలంటూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ రాష్ట్ర కార్యదర్శి జయ వింధ్యాల దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. మరియమ్మ, ఆమె కుమారున్ని ఈ నెల 15న పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్ర చిత్రహింసలకు గురిచేశారని పిటిషనర్ తరఫున న్యాయవాది పి.శశికిరణ్ వాదనలు వినిపించారు. పోలీసుల చిత్రహింసలు భరించలేక ఈనెల 18న మరియమ్మ చనిపోయిందని తెలిపారు. ఈ వ్యవహారంపై స్థానిక న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, బాధిత కుటుంబానికి రూ.5 కోట్లు పరిహారం ఇప్పించాలని, ఈ మొత్తాన్ని మరియమ్మ మృతికి కారణమైన పోలీసు అధికారుల జీతాల నుంచి వసూలు చేసేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. లాకప్డెత్ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశిం చామని, ఘటన జరిగిన సమయంలో ఉన్న కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నిబంధనల మేరకు ఈ వ్యవహారంపై ఆర్డీవో విచారణ చేస్తున్నారని, పోస్టుమార్టంను వీడియో తీశామని తెలిపారు. మరియమ్మ మృతదేహాన్ని కుమార్తెకు అప్పగించామని, వారు ఖననం కూడా చేశారని వివరించారు. సీఆర్పీసీలో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ తో మాత్రమే విచారణ చేయించాలని స్పష్టంగా ఉన్నా... ఎన్హెచ్ఆర్ నిబంధనల మేరకు ఆర్డీవో ఎలా విచారణ చేయిస్తారని ధర్మాసనం ప్రశ్నిం చింది. లాకప్డెత్ ఘటనపై ఆలేరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ను విచారణ జరిపి సీల్డ్కవర్లో నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. మృతురాలి బంధువులకు నోటీసులు జారీ చేసి వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఆదేశించింది. పోలీస్స్టేషన్లో సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు? లాకప్డెత్ జరిగిన రోజుకు సంబంధించి పోలీస్ స్టేషన్లోని సీసీ కెమెరా రికార్డులను పెన్డ్రైవ్లో వేసి సీల్డ్కవర్లో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు సమర్పించాలని ధర్మాసనం ఏజీకి సూచించగా... పోలీస్స్టేషన్ ఓ ప్రైవేట్ భవనంలో ఉందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని నివేదించారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రతి పోలీస్స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినా ఇప్పటికీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం కోర్టుధిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేసింది. సీసీ కెమెరాలు ఉంటే సదరు మహిళది సహజ మరణమా.. చిత్రసింహల వల్లే చనిపోయిందా.. అన్నది నిర్ధారణ అయ్యేదని ధర్మాసనం పేర్కొంది. పోలీస్ స్టేషన్లో సాధారణంగా ఎవరైనా చనిపోయినా ఎవరూ విశ్వసించరని, అలాంటప్పుడు సీసీ కెమెరా రికార్డు ఆధారంగా ఉంటుందని పేర్కొంది. నిజాయితీపరులైన పోలీస్ అధికారులు ఇబ్బందులు పడకూడదనే, వారి రక్షణ కోసమే పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ధర్మాసనం గుర్తు చేసింది. -
బంగారం కుదవ పెట్టి..బిల్లులు కడుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయని, రోగుల బంధువులు బంగారాన్ని కుదవపెట్టి బిల్లులు కట్టాల్సి వస్తోందని హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ‘ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలకు ఒకే తరహాలో ధరలు నిర్ణయించాలని గతంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ మేరకు కొత్త జీవో జారీచేయాలని ఆదేశించినా పట్టనట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు..?’అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ధరలు నిర్ణయిస్తే ప్రయోజనం ఏంటని నిలదీసింది. ‘జీవో జారీకి సంబంధించి ప్రభుత్వానికి సూచన చేయలేదు, జీవో జారీ చేయాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేశాం. అయినా పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా అధిక బిల్లులు వసూలు చేశారంటూ ప్రైవేటు హాస్పిటల్స్పై వచ్చిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారు? అధిక బిల్లులపై 79 ఫిర్యాదులు వచ్చాయని నివేదికలో పేర్కొన్నా.. వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయలేదు? ప్రభుత్వమే ఇంత బాధ్యతారహితంగా ఉంటే బాధితులు ఎవరిని ఆశ్రయించాలి? చట్టవిరుద్ధంగా వసూలు చేసిన డబ్బు ప్రైవేటు ఆసుపత్రుల దగ్గర ఉంటే ఎలా?’ అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అసమగ్రంగా, అసంపూర్తిగా నివేదిక ఇచ్చారు ‘గతంలో ఇచ్చిన జీవోను సవరించి పీపీఈ కిట్లు, సీటీ స్కాన్ తదితర పరీక్షలకు ధరలను నిర్ణయించాలని ఆదేశించాం. ఈ మేరకు గతంలో ఉన్న ధరలను రివైజ్ చేసి తాజాగా జీవో జారీ చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చాం. ఈ జీవోను ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పాం. విపత్తు నిర్వహణ చట్టం కింద అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేయాలన్నాం. ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగేలా పర్యవేక్షించేందుకు నోడల్ అధికారిని నియమించాలని స్పష్టం చేశాం. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పమన్నాం. కానీ ప్రజా ఆరోగ్య విభాగం సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ సమర్పించిన నివేదికలో గతంలో తామిచ్చిన ఆదేశాలు అమలు చేశారో లేదో ఎక్కడా పేర్కొనలేదు. అసమగ్రంగా, అసంపూర్తిగా నివేదిక సమర్పించారు. మేము అడిగిన ఏ ప్రశ్నకు ఇందులో సమాధానం లేదు. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా, బాధ్యతా రహితంగా వ్యవహరిస్తే ఎలా..?’అంటూ ధర్మాసనం అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్కు శరపరంపరగా ప్రశ్నలు సంధించింది. గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుపై వివరణ ఇచ్చేందుకు కొంత సమయం కావాలని ఏజీ నివేదించగా...15 రోజుల సమయం ఇచ్చినా ఇంకా గడువు కోరడం ఏంటని ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు వేస్తే చెల్లించాల్సిన అవసరం లేదని ఏజీ పేర్కొనగా.. కొన్ని ఆసుపత్రులు లక్షల్లో బిల్లులు వేసి డబ్బు కట్టకపోతే స్వస్థత పొందినా.. రోగిని డిశ్చార్జ్ చేసే పరిస్థితి లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నామని, గతంలో తామిచ్చిన ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలు, లేవనెత్తిన ప్రశ్నలపై వివరణ ఇవ్వాలని, విచారణకు ప్రజా ఆరోగ్య విభాగం డైరెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, డీజీపీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది. కరోనా నియంత్రణకు, బ్లాక్ ఫంగస్ చికిత్సకు కేటాయించిన ఔషధాలను ఆసుపత్రులకు అందించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదిని అంతకుముందు ధర్మాసనం ప్రశ్నించింది. కేటాయించిన వాటిలో ఒక్క ఇంజక్షన్ అందని పరిస్థితి ఉందని, ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీసింది. కాగా ‘అధిక బిల్లులు వసూలు చేసిందంటూ గత ఏడాది విరించి ఆసుపత్రికి కరోనా చికిత్సలు చేయకుండా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు మళ్లీ ఇదే ఆసుపత్రిపై ఇదే తరహా ఆరోపణలు రావడంతో మళ్లీ చికిత్సలు చేయరాదని ఆదేశించారు. దీంతో లక్షలాది రూపాయలు ఫీజుగా చెల్లించిన బాధితులకు న్యాయం జరగడం లేదు. అధికంగా వసూలు చేసిన బిల్లులను తిరిగి వారికి ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు..’అని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్, న్యాయవాదులు అర్జున్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎం.రంగయ్య తదితరులు నివేదించారు. చిన్నారులకు ఒకే ఆసుపత్రా? ‘కరోనా మొదటి, రెండో దశతో ఎన్నో విలువైన ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. పొంచి ఉన్న మూడో దశతో రాబోయే తరం...చిన్నారుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. మహారాష్ట్రలో కరోనా మూడో దశ విజృంభిస్తోంది. ఒక్క జిల్లాలోనే 8 వేల చిన్నారులు కరోనా బారిన పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఇంతటి ప్రమాద ఘంటికలు మోగుతున్నా తెలంగాణ వ్యాప్తంగా చిన్నారుల వైద్యానికి నీలోఫర్ లాంటి ఒకే ఒక ప్రభుత్వ ఆసుపత్రా? ఇందులోనూ 8 ఐసీయూ, 12 ఆక్సిజన్ పడకలు మాత్రమే ఉన్నాయా? ఇలా ఉంటే కరోనా బారినపడే చిన్నారులకు ఎలా చికిత్స అందిస్తారు?’అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ‘కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని గతంలో ఆదేశించినా ప్రభుత్వం సమర్పించిన నివేదికలో చర్యలు తీసుకుంటున్నామని నామమాత్రంగా మాత్రమే పేర్కొన్నారు. ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇందుకోసం కొత్తగా ఎన్ని పడకలను ఏర్పాటు చేశారు? ఎంతమంది వైద్య సిబ్బందిని నియమించారు? అవసరమైన ఔషధాలను ఏమేరకు సమకూర్చుకున్నారు? ఇలాంటి వివరాలేవీ నివేదికలో పేర్కొనలేదు’అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. -
అంబులెన్స్లను అడ్డుకోవడంపై తెలంగాణ హైకోర్టు సీరియస్
అంబులెన్స్లను అడ్డుకోవడంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ -
అంబులెన్సులు ఆపొద్దు... ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సరిహద్దుల్లో కరోనా రోగులతో ఉన్న అంబులెన్సులను ఆపేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ‘ప్రాంతీయ భావంతో ప్రజల ప్రాణాలు తీస్తారా, రాజ్యాంగం కల్పిం చిన ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా వ్యవహరిస్తారా? ప్రజల జీవించే హక్కును కాలరాస్తారా’ అని మండిపడింది. కేంద్రం అనుమతి లేకుండా జాతీయ రహదారులపై అంబులెన్స్లను ఆపే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారని నిలదీసింది. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా, ఈ నెల 11న తామిచ్చిన ఆదేశాలను ఉల్లంఘించేలా రాష్ట్ర ప్రభుత్వ మెమో ఉందని.. ఆ మెమో జారీచేసిన అధికారులు కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంబులెన్సులను రాష్ట్ర సరిహద్దుల్లో ఆపేసేలా ఇచ్చిన ఆదేశాల అమలును నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించాలంటే కంట్రోల్ రూం ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. రాష్ట్రంలోకి అంబులెన్సుల ప్రవేశానికి సంబంధించిన ఈ మెమోను మార్చి.. మరో రూపంలో ఆదేశాలు ఇవ్వడానికి కూడా వీల్లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తమ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని, సరిహద్దుల్లో ఉన్న అధికారులకు సమాచారమిచ్చి అం బులెన్స్ల ప్రవేశానికి ఇబ్బంది లేకుండా చూడాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించింది. మా ఆదేశాలకు వక్రభాష్యం రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఇక్కడి ప్రజల ప్రయోజనం కోసం అంబులెన్సుల నిలిపివేత ఆదేశాలు ఇచ్చినట్లు కనిపించడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ప్రాంతీయ భావంతోనే ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వైద్యం కోసం రాకుండా అడ్డుకునేందుకు ఈ తరహా ఆదేశాలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. రాతపూర్వక ఆదేశాలు ఇవ్వకుండా అంబులెన్స్ల ప్రవేశాన్ని ఎలా నిలిపివేస్తారని గత విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. అంబులెన్స్లు ఆపొద్దంటూ ఈనెల 11న మేమిచ్చిన ఉత్తర్వులకు రాష్ట్ర ప్రభుత్వం వక్రభాష్యం చెప్పింది. కరోనా రోగులతో ఉన్న అంబులెన్సుల ప్రవేశాన్ని ఏ చట్టం నిషేధించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వివక్షాపూరితంగా ఉంది. అహ్మదాబాద్లో ప్రభుత్వ అంబులెన్సుల్లో వచ్చే వారినే అడ్మిట్ చేసుకోవాలంటూ, ఒక సిటీ నుంచి మరో సిటీలోని ఆస్పత్రుల్లో రోగులు చేరకుండా ఇచ్చిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల అడ్మిషన్కు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే తరహా విధానాన్ని రూపొం దించాలని సుప్రీం కోర్టు ఇటీవలే కేంద్రాన్ని ఆదేశించింది కూడా. స్థానికత ఆధారంగా వైద్యం అందిస్తామనడం, ముందస్తు అనుమతి ఉంటేనే కరోనా రోగుల అంబులెన్స్లను రాని స్తామనడం దారుణం’ అని ధర్మాసనం పేర్కొం ది. ఈ వ్యవహారంపై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఆదేశిస్తూ.. విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. పలు రాష్ట్రాలు ఈ తరహా ఆదేశాలిచ్చాయి: ఏజీ సరిహద్దుల్లోని మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఛత్తీస్ఘడ్ నుంచి పెద్ధ సంఖ్యలో కరోనా రోగులు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నారని.. ఇక్కడ అడ్మిషన్ దొరక్క ఇబ్బంది పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ హైకోర్టుకు వివరించారు. వారంతా రోడ్ల మీదే నిరీక్షిస్తుండటంతో కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ‘కరోనా రోగుల ప్రవేశాన్ని కట్టడి చేస్తూ రాజస్తాన్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు కూడా ఆదేశాలు ఇచ్చాయి. మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు చెందిన కరోనా రోగులను ఆ రాష్ట్రంలోకి అనుమతించట్లేదు. తెలంగాణ ప్రభుత్వం అంత తీవ్రమైన ఆదేశాలు ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాల కరోనా రోగులకు వైద్యం నిరాకరించట్లేదు. కరోనా కట్టడి, లాక్డౌన్లో భాగంగానే.. ఆస్పత్రుల్లో అడ్మిషన్ లేనివారి అంబులెన్స్ల నిలిపివేత నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో నిబంధనలకు లోబడే ఉంది’ అని వివరించారు. వివక్ష చూపించడమే: ఏపీ ఏజీ ఎస్.శ్రీరాం అంబులెన్సుల కేసులో ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరాం వాదనలు వినిపించారు. ‘అంటువ్యాధుల నియంత్రణ చట్టం, విపత్తు నిర్వహణ చట్టాల మేరకు మెమో జారీ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్నా.. ఆ చట్టాల సారాంశానికి విరుద్ధంగా ఆ మెమో ఉంది. నివాస ప్రాంతం ఆధారంగా కరోనా రోగుల ప్రవేశాన్ని నియంత్రిస్తామనడం వివక్ష చూపడమే. కంట్రోల్ రూం ముందస్తు అనుమతి పేరుతో జాప్యం జరిగితే.. తగిన సమయంలోగా వైద్యం అందక రోగులు చనిపోయే ప్రమా దం ఉంది. అంబులెన్స్ల ప్రవేశానికి సంబంధించి తెలంగాణ జారీ చేసిన ఉత్తర్వులు ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి గురువారం రాత్రి అందాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే సరిహద్దుల్లో అంబులెన్స్ లు ఆపుతున్నారు. ముందస్తు అనుమతి పేరిట వివక్షతో ప్రాణాలు తీస్తారా?’ అని పేర్కొన్నారు. చదవండి : తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్ల నిలిపివేత సరిహద్దుల్లో అంబులెన్స్లను నిలిపేయడం దురదృష్టకరం: సజ్జల
Related News by category
-
Palakollu: నిమ్మలకు హ్యాట్రిక్ గండం
సాక్షి, భీమవరం/ పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని హ్యాట్రిక్ గండం వెంటాడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడాల గోపికి లభిస్తున్న జనాదరణ, కూటమిలోని అసమ్మతి సెగలు, వరుసగా మూడోసారి పట్టం కట్టని పాలకొల్లు ప్రజల నాడి ఆయనకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ఎన్నికల్లోనూ చరిత్రే పునరావృతమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 70 ఏళ్ల చరిత్ర పాలకొల్లు శాసనసభ నియోజకవర్గానికి 70 ఏళ్ల చరిత్ర ఉంది. 1955 నుంచి ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 1983, 1985 అలాగే 1994, 1999 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు అల్లు వెంకటసత్యనారాయణ గెలుపొందారు. అయితే వరుసగా మూడోసారి పోటీచేసిన సందర్భంలో ప్రజలు ఆయన్ను ఓడించారు. తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలుపొందుతూ వచ్చిన రామానాయుడు ప్రస్తుత ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. ఇప్పటివరకు ఏ అభ్యరి్థకీ నియోజకవర్గంలో వరుసగా మూడోసారి ప్రజలు పట్టం కట్టడం పాలకొల్లు చరిత్రలో లేదు. ఐదేళ్లలో అభివృద్ధి, సంక్షేమం రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మల ప్రచార ఆర్భాటంలో తప్ప అభివృద్ధిలో తనదైన ముద్రను వేసుకోలేకపోయారు. చెప్పుకోదగిన స్థాయిలో ప్రజాసమస్యలను పరిష్కరించలేకపోయారు. అయితే సీఎం జగన్ పాలనలోని ఈ ఐదేళ్లలో కులమత వర్గాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ లబ్ధిని చేకూర్చడంతో పాటు అభివృద్ధి పనుల్లోనూ పాలకొల్లుకు అధిక ప్రాధాన్యమిచ్చారు. పాలకొల్లు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సుమారు రూ.1,440 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా 6.84 లక్షల మంది లబి్ధదారులకు రూ.619 కోట్ల లబ్ధి చేకూరింది. మెడి‘కల’ సాకారం పాలకొల్లు మండలం దగ్గులూరులో రూ.475 కోట్ల వ్యయంతో 61 ఎకరాల విస్తీర్ణంలో వైద్య కళాశాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 150 మంది విద్యార్థులు కళాశాలలో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించనున్నారు. వంద పడకల ఆస్పత్రికి నిధుల మంజూరు లేకుండానే గత ఎన్నికల ముందు ఎమ్మెల్యే నిమ్మల ప్రజలను నమ్మిచేందుకు బోగస్ శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు. కాగా సీఎం జగన్ పాలనలో రూ.16.60 కోట్ల వ్యయంతో 150 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టి పూర్తిచేయడం గమనార్హం. రూ.15 కోట్లతో పాలకొల్లులో తాగునీటి ఫిల్టర్ బెడ్ నిర్మించారు. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం ప్రచారాస్త్రంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.అసమ్మతి సెగలు ఎమ్మెల్యే నిమ్మల వైఖరిపై కూటమి నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. స్వతహాగా కిందిస్థాయి కేడర్ను ఎదగనివ్వరని ఆయనకు పేరుంది. కూటమిలోని జనసేన, బీజేపీ నేతల విషయంలోను అదే వైఖరిని అవలంబిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఎన్నికల ప్రచారానికి అవసరమైన సామగ్రిని అభ్యర్థి సమకూరుస్తుంటారు. కాగా ప్రచారంలో పాల్గొనే కూటమి నాయకులను ఎవరి పార్టీ జెండాలు వారే తెచ్చుకోవాలని సూచిస్తుండటంతో పాటు ప్రచారం చేసే సమయంలో తనను దాటుకుని ఎవరూ ముందుకు వెళ్లకూడదని ఆయన చెబుతున్నారంట. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి బీజేపీ పోటీ చేస్తున్న నేపథ్యంలో వారు జెండా ఖర్చులు భరించుకుంటారని, మద్దతు తెలుపుతున్న తమపై ఖర్చులు రుద్దుతున్నారని జనసేన నాయకులు అంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం సరిగా చెప్పడం లేదని మండిపడుతున్నారు. నియోజకవర్గంలో పట్టున్న జనసేన పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర చైర్మన్ బన్నీ వాసు ప్రెస్మీట్లకే తప్ప ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇటీవల చంద్రబాబునాయుడు వచ్చిన సందర్భంలో బన్నీవాసును వేదికపైకి రాకుండా అడ్డుకోవడం పట్ల ఆయన మనస్తాపానికి గురై వెళ్లిపోవడంతో మరుసటిరోజు ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించి చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. ఆ అవమానభారంతో ఆయన ప్రచారానికి దూరంగా ఉంటున్నట్టు సమాచారం. బీజేపీ నేతలకు కూడా నిమ్మల వ్యవహారశైలి మింగుడు పడటం లేదు.ప్రజలతో గోపి మమేకం ఓ పక్క ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడాల గోపి ప్రజలతో మమేకమవుతుంటే.. ఓటర్లను ఆకట్టుకునే విన్యాసాలే తప్ప చెప్పుకోవడానికి చేసిందేమీ లేదన్నట్టుగా నిమ్మల ప్రచారం సాగుతోందని సొంతగూటి నేతలే చెప్పుకుంటున్నారు. ఒక పక్క అధికార పక్షం జోరు, మరోపక్క పాల కొల్లు సెంటిమెంట్తో చరిత్ర పునరావృతమవుతుందని చెవులు కొరుక్కుంటున్నారు. -
కామినేని కట్టుకథలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఒట్టు వేసి ఒక మాట.. వేయకుండా ఒక మాట చెప్పను.. ఇది పాపులర్ సినిమా డైలాగ్. అయితే ఈ నేత మాత్రం ఒట్టు వేసి మరీ చెప్పిన మాటలను అధికారంలోకి రాగానే కొల్లేటిలో కలిపేస్తారు. మళ్లీ ఎన్నికలు రాగానే అవే హామీలు, మాటలను మళ్లీమళ్లీ చెబుతూ ప్రజలను మభ్యపెట్టడం పరిపాటిగా మార్చుకున్నారు. ఆయనే కైకలూరు బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్. తనకు విస్తృత పరిచయాలు ఉన్నాయని.. కొల్లేరు సమస్యలు నరేంద్ర మోదీతో మాట్లాడి సెటిల్ చేస్తానని.. జలజీవన్ మిషన్ మనదేనని.. ఇంటింటికీ మంచినీరు ఇస్తానని ఇలా బిల్డప్ బాబాయ్ మాదిరిగా అడ్డగోలుగా మాటలు చెబుతూ రాజకీయం చేస్తుంటారు. కేవలం మూడు పారీ్టలు ఉంటేనే కూటమి బీజేపీ అభ్యరి్థగా బరిలో నిలవడం, మూడు పారీ్టలు లేకపోతే బీజేపీని స్థానికంగా గాలికి వదిలేసి విదేశాల్లో ఉండటం ఆయనకు సర్వసాధారణం. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఇలాంటి మోసపూరిత హామీలు, ఒట్లతో కామినేని కైకలూరులో ప్రచారం చేస్తున్నారు. జెండాలు జతకడితేనే.. కామినేని శ్రీనివాస్ తనని తాను బీజేపీ నేతగా అభివరి్ణంచుకుంటారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యరి్థగా కైకలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయా రు. అయితే బడా వ్యక్తులతో ఆర్థిక సంబంధాలు, బంధుత్వాలతో బీజేపీ పెద్దాయన సూచనలతో 2014లో బీజేపీలో చేరి కైకలూరు నుంచి కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. మొదటిసారి గెలిచిన వెంటనే చంద్రబాబు కేబినెట్లో ఆరోగ్యశాఖ మంత్రిగా కొనసాగారు. కట్ చేస్తే.. 2019లో జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు లేకపోవడంతో హైదరాబాద్, అమెరికాకు పరిమితమై స్థానిక బీజేపీని పూర్తిగా నిరీ్వర్యం చేసి టీడీపీ నేతలకు సహకారం అందించారు. ఫలితంగా టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఐదేళ్ల పాటు కైకలూరు వైపు కన్నెత్తి చూడలేదు. తాజాగా పొత్తు ఆశలు చిగురించడం, మూడు పార్టీల చర్చలు మొదలు కావడంతో మళ్లీ కైకలూరు తనదేనంటూ హడావుడి మొదలుపెట్టి జెండా.. అజెండా లేకుండా నియోజకవర్గంలో కొద్దిరోజులు తిరిగారు. టికెట్ ఖరారు కావడంతో బీజేపీ అభ్యరి్థగా మళ్లీ తిరుగుతున్నారు. పెద్దింట్లమ్మపై ఒట్టు కామినేని శ్రీనివాస్కు ఒట్లు వేయడం బాగా అలవాటు. ఒక్కోసారి ఒక్కో దేవుడిని వాడుకుంటారు. ఒకసారి కాణిపాకం వినాయకుడు, మరో సారి కైకలూరు శ్యామలాంబ, కొల్లేటికోట పెద్దింట్లమ్మ, ఆయన స్వగ్రామంలో లక్ష్మీనృసింహస్వామి ఇలా అందరిపైనా ఒక రౌండ్ ఒట్లు వేసేశారు. 2014లో కాంటూరు కుదింపు, పెద్దింట్లమ్మ వారధి నిర్మిస్తానని కొల్లేటికోట పెద్దింట్లమ్మపై ఒట్టు వేసి నెరవేర్చని కామినేని తిరిగి మళ్లీ ఇటీవల అమ్మవారిపై కొల్లేరు సమస్యలు పరిష్కరిస్తానని ఒట్టు వేశారు. చనిపోయిన తన అమ్మ చివరి కోరిక ఎమ్మెల్యే కావడం.. భవిష్యత్తులో ఇక పోటీ చేయనని, ఈసారి కొత్తగా అమ్మ సెంటిమెంట్తో జనాల్లోకి వెళుతున్నారు. -
రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్లపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో ఆర్ఎస్ఎస్పై స్వార్థంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్రచారం అంతా అసత్యం, అబద్దమని పేర్కొన్నారు.రిజర్వేషన్లను ఆర్ఎస్స్ పూర్తిగా సమర్తిస్తుందని, ఎవరికోసం అయితే కేటాయించబడ్డాయో వారి అభివృద్ది జరిగే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని తెలిపారు. రిజర్వేషన్లపై వివాదం సృష్టించి లబ్ది పొందాలని అనుకుంటున్నారని, వాటితో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.ఇక... 2025 నాటికి రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు కోసం 2025 నాటి కల్లా రిజర్వేషన్లు సమూలంగా రద్దు చేసేందుకు ప్రధాని మోదీ, అమిత్ షాలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్పై వస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. -
బాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
సాక్షి, తాడిపత్రి: టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టినట్టేనని గుర్తు పెట్టుకోవాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అలాగే, చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపినట్టేనని సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు.కాగా, సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడిపత్రి సభలో మాట్లాడుతూ.. ఎన్నికల యుద్ధానికి మీరు సిద్ధమేనా? తాడిపత్రి సిద్ధమేనా?. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ల భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలు. జెండాలు జతకట్టుకుని వారంతా వస్తున్నారు. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టినట్టేనని గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపినట్టే. జగన్కు ఓటు వేస్తే.. పథకాలన్నీ కొనసాగింపు.పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలకు ముగింపే. చంద్రబాబు సాధ్యం కానీ హామీలిస్తున్నారు.నా మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాను. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించాం. రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ ఖాతాల్లో జమ చేశాం. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. 58 నెలల కాలంలో 2.31లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. పౌరసేవల్లో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. ప్రతీ గ్రామం, పట్టణంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. రైతు భరోసా కేంద్రం.. గ్రామాల్లోనే కనిపిస్తుంది. ఇంటి వద్దకే రేషన్ వస్తోంది. పెన్షన్లు నేరుగా మీ ఇంటి వద్దకే వస్తున్నాయి. మీ బిడ్డ పాలనలో ఇంటి వద్దకే వైద్య సేవలు అందుతున్నాయి. మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే వస్తే మీ జీవితాలు ఎంతగా బాగుపడతాయో ఊహించండి. నాడు-నేడుతో స్కూళ్ల రూపరేఖలను మార్చాం. టాప్ యూనివర్సిటీలతో మన డిగ్రీ కాలేజీలను అనుసంధానం చేశాం. ప్రభుత్వ స్కూల్స్లో హక్కుగా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. మరో 10, 15 ఏళ్లలో ఇలాంటి పాలనే ఉంటే ప్రజల జీవితాలు ఎంతగా బాగుపడతాయో ఊహించండి. గతంలో ఎప్పుడైనా మహిళా సాధికారత చూశారా?.చట్టం చేసి 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి నామినేటెడ్ పదవులు ఇచ్చాం. గతంలో ఎప్పుడైనా 31 లక్షల ఇళ్ల పట్టాలు చూశారా?.రైతు భరోసా పథకాన్ని ఎప్పుడైనా చూశారా?.80 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో సగం స్థానాలు కేటాయించాం. మోసాలు, కుట్రలను నమ్ముకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా?. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి ఇదే కూటమి గతంలో ప్రజలను మోసం చేసింది.రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశాడు. ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు. ఆడపిల్ల పుట్టగానే బ్యాంకుల్లో రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్న చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారా?. అర్హుందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు అన్న చంద్రబాబు ఎవరికైనా ఇచ్చారా?. ఇప్పుడు సూపర్ సిక్స్ హామీల పేరుతో మరో డ్రామా ఆడుతున్నారుసంక్షేమ పాలన కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలితాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణను అఖండ మెజారిటీతో గెలిపించాలిహామీలు నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశీస్సులు కోరతున్నాడు. ప్రజలకు మంచి చేశాకే మీ బిడ్డ మీ దీవెనలు కోరుతున్నాడు అని కామెంట్స్ చేశారు. -
జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
సాక్షి, అనంతపురం: తాడిపత్రి వైఎస్సార్సీపీ ఎమ్యెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ బ్రదర్స్కు సవాల్ విసిరారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధిపై నేను బహిరంగ చర్చకు సిద్ధం. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధమా?. గత 35 సంవత్సరాల్లో జేసీ బ్రదర్స్ అనేక అరాచకాలు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే తాడిపత్రి ప్రశాంతంగా ఉంది’ అని కేతిరెడ్డి అన్నారు.
Advertisement
Photos
View allVideo
View allదిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement