ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య | Engineering student suicide | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

Jan 22 2014 3:51 AM | Updated on Nov 6 2018 7:53 PM

పరీక్షకు హాజరుకాలేక పోయానన్న మనస్థా పంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రెనీ ఎస్సై అశోక్ చక్రవర్తి తెలిపిన వివరాల ప్రకా రం

 బలిజిపేట రూరల్, న్యూస్‌లైన్ : పరీక్షకు హాజరుకాలేక పోయానన్న మనస్థా పంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రెనీ ఎస్సై అశోక్ చక్రవర్తి తెలిపిన వివరాల ప్రకా రం...   మండలంలోని అరసాడ గ్రామానికి చెందిన సంకిలి సతీష్(19) దాకమర్రి వద్ద ఉన్న ‘విట్స్’ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలోనే హాస్టల్‌లో ఉంటున్నాడు. అయితే పండగ సెలవుల సందర్భంగా స్వగ్రామం అరసాడకు వచ్చాడు. కళాశాలలో సోమవారం ప్రాక్టికల్స్ పరీక్ష ఉంది. దీనికోసం ఆ విద్యార్థి విజయనగరం వెళ్లవలసి ఉంది. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో  స్వగ్రామం నుంచి బొబ్బిలి బయలుదేరి వెళ్లాడు, అక్కడ నుంచి విజయనగరానికి ట్రైన్ మీద వెళ్లేందుకు యత్నించాడు. అయితే ట్రైన్ మిస్ అవడంతో  తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. పరీక్షకు హాజరు కాలేకపోయాననే మనస్థాపానికి గురయ్యాడు. దీంతో సోమవారం సాయంత్రం అరసాడలోని బస్టాప్ వద్ద పురుగు మందు తాగాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని వెంటనే అతనిని బొబ్బిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు 
 

Advertisement
 
Advertisement
Advertisement