తూర్పుపాలెంలో పేలిన ట్రాన్స్ఫార్మర్ | electrical transformer at Toorpupalem | Sakshi
Sakshi News home page

తూర్పుపాలెంలో పేలిన ట్రాన్స్ఫార్మర్

Published Mon, Jul 21 2014 11:13 AM | Last Updated on Wed, Sep 5 2018 4:17 PM

తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలో సోమవారం ఉదయం జీసీఎస్లో ట్రాన్స్ఫార్మర్ పేలింది.

మలికిపురం : తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలో సోమవారం ఉదయం జీసీఎస్లో ట్రాన్స్ఫార్మర్ పేలింది. దాంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. మంటలు చమురు ట్యాంకులకు వ్యాపించకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కాగా నగరం ఘటన మరవక ముందే ట్రాన్స్ఫార్మర్ పేలిన ఘటనతో ఆ ప్రాంత వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement