
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈద రాజశేఖర్ రెడ్డిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. రాజశేఖర్ రెడ్డి గుంటూరు జిల్లా, గురజాల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారు. దీనికి సంబంధించి కేంద్ర పార్టీ కార్యాలయం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది.