సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పది వేల రూపాయల వేతనం ఇస్తామని ప్రకటిస్తే గానీ ఈ ప్రభుత్వంలో చలనం రాలేదని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసే వీవోఏ (డ్వాక్రా యానిమేటర్లు), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసే ఆర్పీ (పట్టణ రిసోర్సు పర్సన్)లు మండిపడ్డారు. తమ వేతనాల విషయంలో నెల రోజుల్లోగా సానుకూల నిర్ణయం ప్రకటించకపోతే సమ్మెలోకి వెళతామని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. వీవోఏలు, ఆర్పీలకు నెలకు రూ. 5,000 వేతనం చెల్లించాలని, కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో వేలాది మంది డ్వాక్రా యానిమేటర్లు, ఆర్పీలు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి స్థానిక అలంకార్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం ధర్నా చౌక్లో పెద్దఎత్తున ధర్నా చేశారు. ఏపీ వెలుగు వీవోఏ సంఘం, ఏపీ మెప్మా ఆర్పీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి, సీఐటీయూ నాయకులు మద్దిలేటి, అలివేణి నేతృత్వంలో జరిగిన ధర్నాలో ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ పాల్గొని ఆందోళనకారులకు మద్దతు తెలిపారు.
వీవోఏలు, ఆర్పీలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వ ప్రతినిధిగా మెప్మా ఎండీ చిన తాతయ్య ధర్నా చౌక్ వద్దకు వచ్చారు. ఆగస్టు 15లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. ఈ ప్రకటనపై ఆందోళనకారులు మండిపడ్డారు. రెండేళ్ల క్రితం గత ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్ను అమలు చేయాలనే డిమాండ్తో ఆందోళన చేయతలపెడితే.. ఆదిలోనే అణిచివేయడానికి ప్రయత్నించారని, గృహ నిర్భందంలో ఉంచారని మండిపడ్డారు.
ప్రకటన చేస్తే సరిపోదు..
ధర్నాలో నేతలు ప్రసంగిస్తూ.. వేతనాలు చెల్లింపుపై సీఎం కేవలం ప్రకటన చేయడమో లేదంటే సర్కులర్లు జారీ చేయడమో కాకుండా పూర్తి విధి విధానాలతో జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. 2013లో కిరణ్కుమార్రెడ్డి హయాంలో రూ. 2 వేలు వేతనం చెల్లించడానికి అప్పటి ప్రభుత్వం సర్కులర్ జారీ చేయడయే కాకుండా, 2 నెలలు వేతనాలు కూడా ఇచ్చారని తెలిపారు. తర్వాత అధికారంలో వచ్చిన టీడీపీ ప్రభుత్వం వీవోఏలు, ఆర్పీలకు వేతనం చెల్లించడం నిలిపివేసిందని మండిపడ్డారు. వీవోఏలకు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన రూ. 2 వేల వేతనాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వకుండా నాలుగేళ్లుగా ఇబ్బంది పెడుతోందని గఫూర్ దుయ్యబట్టారు.
నెలరోజుల్లో వేతనాల విషయం తేల్చకుంటే సమ్మెలోకి..
Published Tue, Jul 17 2018 3:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement