Sakshi News home page

జిల్లాల మంత్రుల సమీక్ష

Published Sat, Feb 7 2015 6:07 PM

District Council of Ministers Review

కడప: పోలీసుల సంక్షేమం కోసం కృషి చేయడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి  నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కడప జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రులు చినరాజప్ప, పీతల సుజాత, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఇసుక రవాణాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, మైనింగ్ ద్వారానే రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. నకిలీ మద్యం అమ్మకాలు అడ్డుకోవాలని అధికారులకు హోమంత్రి చినరాజప్ప సూచించారు.

Advertisement
Advertisement