జిల్లాల మంత్రుల సమీక్ష | District Council of Ministers Review | Sakshi
Sakshi News home page

జిల్లాల మంత్రుల సమీక్ష

Feb 7 2015 6:07 PM | Updated on Sep 2 2017 8:57 PM

పోలీసుల సంక్షేమం కోసం కృషి చేయడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.

కడప: పోలీసుల సంక్షేమం కోసం కృషి చేయడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి  నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కడప జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రులు చినరాజప్ప, పీతల సుజాత, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఇసుక రవాణాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, మైనింగ్ ద్వారానే రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. నకిలీ మద్యం అమ్మకాలు అడ్డుకోవాలని అధికారులకు హోమంత్రి చినరాజప్ప సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement