శోభానాగిరెడ్డి సౌమ్యశీలి, స్నేహశీలి: చంద్రబాబు | chandrababu naidu homage to shobha nagi reddy | Sakshi
Sakshi News home page

శోభానాగిరెడ్డి సౌమ్యశీలి, స్నేహశీలి: చంద్రబాబు

Jun 19 2014 6:02 PM | Updated on Aug 20 2018 8:52 PM

శోభానాగిరెడ్డి సౌమ్యశీలి, స్నేహశీలి: చంద్రబాబు - Sakshi

శోభానాగిరెడ్డి సౌమ్యశీలి, స్నేహశీలి: చంద్రబాబు

దివంగత భూమా శోభానాగిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంతాపం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

హైదరాబాద్: దివంగత భూమా శోభానాగిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంతాపం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ శోభానాగిరెడ్డి సేవలను కొనియాడారు. చిన్న వయస్సులోనే ఆమె ఎమ్మెల్యే అయ్యారని ప్రశంసించారు.

తాగునీటి సమస్య పరిష్కారంకోసం అనేక పోరాటాలు చేశారని, రైతు సమస్యలకోసం రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. శోభానాగిరెడ్డి సౌమ్యశీలి, స్నేహశీలి కొనియాడారు. శోభానాగిరెడ్డి కుటుంబానికి చంద్రబాబు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement