చరిత్ర హీనుడు చంద్రబాబు | Call to the success of the bandh | Sakshi
Sakshi News home page

చరిత్ర హీనుడు చంద్రబాబు

Aug 26 2015 4:29 AM | Updated on Mar 23 2019 9:10 PM

దిక్కుమాలిన ప్యాకేజీకి మద్దతు పలికి ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర హీనుడయ్యారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు...

- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి
- 29న బంద్ విజయవంతం చేయాలని పిలుపు
రాజంపేట :
దిక్కుమాలిన ప్యాకేజీకి మద్దతు పలికి ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర హీనుడయ్యారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహనరెడ్డి పిలుపు మేరకు ఈ నెల 29న చేపట్టే బంద్‌ను విఫలం చేయాలని అధికార పార్టీ నేతలు కుట్రలు చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. ఆ దిశగా వైఎస్సార్‌సీపీ ప్రత్యేక హోదా కోసం వామపక్షాలతో కలిసి పోరాడుతోందన్నారు. 29న రాష్ట్ర బంద్‌కు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారన్నారు. భూసేకరణ విషయంలో దేశం అంతా వ్యతిరేకిస్తున్న ఆర్డినెన్స్‌ను అడ్డం పెట్టుకొని తొలి నోటిఫికేషన్ జారీ చే సి రైతుల కడుపుకొడుతున్న రాక్షస ప్రభుత్వం ఇదని దుయ్యబట్టారు. ప్యాకేజీకి సై అన్న చంద్రబాబును ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారన్నారు. కేంద్రం నుంచి టీడీపీ తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ వేయకుండా ఉంటే చాలు అని చెప్పటానికే సీఎం ఢిల్లీ వెళ్లారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement