
సీనియర్ నేత సి రామచంద్రయ్యకు వైఎస్సార్ సీపీలో కీలక బాధ్యతలు అప్పగించారు
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి సి రామచంద్రయ్య ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు.
వైఎస్సార్ జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన రామచంద్రయ్య 1981లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. పలు పార్టీల్లో కీలక పదవులను అలంకరించిన ఆయన రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలందించారు. ఇటీవల వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన సేవలను తగువిధంగా వినియోగించుకుంటామని ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాటిచ్చారు.
చదవండి : వైఎస్సార్ సీపీలో చేరిన రామచంద్రయ్య