సాగునీటి ప్రాజెక్టులకు గతం మాదిరే కేటాయింపులు | Budget for Irrigation projects | Sakshi
Sakshi News home page

సాగునీటి ప్రాజెక్టులకు గతం మాదిరే కేటాయింపులు

Feb 11 2014 2:37 AM | Updated on May 28 2018 4:15 PM

సాగునీటి ప్రాజెక్టులకు గత ఏడాది కేటాయించిన స్థాయిలోనే ప్రస్తుత బడ్జెట్‌లో కూడా నిధులను కేటాయించారు.

సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు గత ఏడాది కేటాయించిన స్థాయిలోనే ప్రస్తుత బడ్జెట్‌లో కూడా నిధులను కేటాయించారు. ఆయా ప్రాజెక్టులకు 2013-14లో కేటాయించిన నిధులకు సమానంగా తాజా బడ్జెట్‌లో కూడా చూపించారు. ఈ విషయంలో ప్రాజెక్టుల నిర్మాణ  దశలను పట్టించుకోలేదు. ఏ ప్రాజెక్టుకు ఎంత మేర నిధులు అవసరమనే విషయాన్ని అంచనా వేయలేదు. అలాగే కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా పోయిన ఏడాది మాదిరిగానే అంచనా వేసి బడ్జెట్‌లో పొందుపరిచారు.

కాగా, నిర్మాణ పనుల్ని పక్కన పెట్టిన దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టుకు రూ. 97 కోట్లను కేటాయించడం విశేషం. అలాగే కేంద్రం నుంచి ఏఐబీపీ కింద రూ. 1394.27 కోట్లు రానున్నాయని అంచనా వేశారు. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులకు ఎక్కువ నిధులను కేటాయించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రూ. 1,051 కోట్లను కేటాయించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నుంచి రూ. 87.50 కోట్ల వస్తాయని, రాష్ట్రం నుంచి రూ. 370.50 కోట్లను వ్యయం చేయాలని నిర్ణయించారు. పునరావాస పనులకోసం రూ. 185 కోట్లను కేటాయించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement