మహిళల ఓటర్ల శాతం తగ్గిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ అన్నారు.
మహిళల ఓటర్ల శాతం తగ్గిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ అన్నారు. పురుషుల ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్లు నాలుగు లక్షలమంది తగ్గినట్టు శనివారం వెల్లడించారు.
19, 18 ఏళ్ల వయసు వారు 38 లక్షల మంది ఓటరు గుర్తింపు కార్డులు తీసుకోలేదని భన్వర్లాల్ తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ జనవరి 1లోగా గుర్తింపు కార్డులు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈసారి జరిగే ఎన్నికల్లో తిరస్కరణ ఓటు కూడా ఉంటుందని చెప్పారు. అన్ని పార్టీలు ఉత్తమ అభ్యర్థులనే ఎన్నికల బరిలో నిలపాలని భన్వర్లాల్ పేర్కొన్నారు.