రాత్రికి రాత్రే సచివాలయాల మధ్య బారికేడ్లు | Barricades break telangana, andhra pradesh secretariats | Sakshi
Sakshi News home page

రాత్రికి రాత్రే సచివాలయాల మధ్య బారికేడ్లు

Jun 21 2014 10:55 AM | Updated on Sep 2 2017 9:10 AM

రాత్రికి రాత్రే సచివాలయాల మధ్య బారికేడ్లు

రాత్రికి రాత్రే సచివాలయాల మధ్య బారికేడ్లు

రాత్రికి రాత్రే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సచివాలయాల మధ్య బారికేడ్లు వెలిశాయి.

హైదరాబాద్ : రాత్రికి రాత్రే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సచివాలయాల మధ్య బారికేడ్లు వెలిశాయి. దాంతో రెండు రాష్ట్రాల సచివాలయాలను మధ్య విభజన రేఖ ఏర్పడినట్లు అయ్యింది. రెండు రాష్ట్రాల సచివాలయాలు వేరు చేస్తూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇరువైపులా భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి.  రాష్ట్ర విభజన సందర్భంగా గతంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఉద్యోగుల మధ్య ఘర్షణ నెలకొన్న విషయం తెలిసిందే. దాంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఈ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

 

Advertisement
 
Advertisement
Advertisement