
బాబు వూట లు నమ్మి మోసపోయూం
టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలంటూ రోడ్డెక్కిన మహిళలు
పార్వతీపురం: టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామంటూ ఎన్నికల సవుయుంలో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఐద్వా ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వుహిళలు తరలివచ్చి స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చంద్రబాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించలేదని, ఇప్పుడు బ్యాంకు అధికారులు పొదుపు సొమ్ము రికవరీ చేస్తున్నారని అన్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, మున్సిపల్ చైర్పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదే విలను నిలదీశారు. టీడీపీని గెలిపించినందుకు మంచి బహుమతే ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాలయాపనకే కమిటీ: సీపీఐ
గుంటూరు: ఎన్నికలకు ముందు రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ వాగ్దానాలను తుంగలో తొక్కుతున్నారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఎన్జీవోలకు, గురుకుల ట్రస్టుకు ఇచ్చిన భూములను లాక్కునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారని, వీటన్నింటిపై సీపీఐ ఆ రాష్ట్రంలో పోరాటాలు చేస్తుందని ఆయన తెలిపారు.