మహంతి వద్దకు చేరిన తెలంగాణ బిల్లు | Assembly secretary sent Telangana bill to chief secretary | Sakshi
Sakshi News home page

మహంతి వద్దకు చేరిన తెలంగాణ బిల్లు

Feb 1 2014 5:46 PM | Updated on Aug 18 2018 4:13 PM

మహంతి వద్దకు చేరిన తెలంగాణ బిల్లు - Sakshi

మహంతి వద్దకు చేరిన తెలంగాణ బిల్లు

రాష్ట్ర శాసనసభ కార్యదర్శి రాజా సదారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు)ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతికి పంపారు.

హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ కార్యదర్శి రాజా సదారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు)ను  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతికి పంపారు. శాసనసభలో చర్చల సారాంశం, తీర్మానాలను క్రోడీకరించి  అందులో పొందుపరిచారు. అయితే సభలో సభ్యులు అందరూ బిల్లుపై తమ అభిప్రాయాలను తెలియజేయని విషయం తెలిసిందే.

 విభజన బిల్లు కేంద్రం నుండి ప్రత్యేక విమానంలో తెచ్చి నేరుగా మహంతికే అప్పగించారు. ఇప్పుడు దానిని  పంపించే బాధ్యత కూడా ఆయనదే. ఈ బిల్లును మహంతి కేంద్ర హొం శాఖకు పంపుతారు.  సోమవారం ఉదయం విమానంలో   ప్రత్యేకాధికారి దీనిని ఢిల్లీ తీసుకు వెళ్లే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement