సీమాంధ్ర అభివృద్ధికి రూ. 60 వేల కోట్లు కావాలి | Andhra pradesh needs 60 thousand crores, says Sailaja nath | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర అభివృద్ధికి రూ. 60 వేల కోట్లు కావాలి

Jun 4 2014 3:15 PM | Updated on Sep 2 2017 8:19 AM

సీమాంధ్ర అభివృద్ధికి రూ. 60 వేల కోట్లు కావాలి

సీమాంధ్ర అభివృద్ధికి రూ. 60 వేల కోట్లు కావాలి

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వేలాది కోట్ల రూపాయిల నిధులు అవసరమని మాజీ మంత్రి శైలజా నాథ్ అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వేలాది కోట్ల రూపాయిల నిధులు అవసరమని మాజీ మంత్రి శైలజా నాథ్ అభిప్రాయపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి అదనంగా 60 వేల కోట్ల రూపాయిల నిధులు తీసుకురావాలని కోరారు.

ఉమ్మడి రాజధాని అయిన జంట నగరాలకు స్వయం ప్రతిపత్తి కల్పించేలా చూడాల్సిన అవసరముందని శైలజా నాథ్ అన్నారు. గతంలో మాదిరిగా భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రలో కలపాలని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement