గన్నవరం నుంచి ఢిల్లీకి ఏయిరిండియా సర్వీసు | Air India started new service from gannavaram to new delhi | Sakshi
Sakshi News home page

గన్నవరం నుంచి ఢిల్లీకి ఏయిరిండియా సర్వీసు

Jan 15 2015 10:45 AM | Updated on Sep 2 2017 7:46 PM

విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా.. గన్నవరం నుంచి న్యూఢిల్లీకి నూతన సర్వీసు ప్రారంభించింది.

విజయవాడ: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా.. గన్నవరం నుంచి న్యూఢిల్లీకి నూతన సర్వీసు ప్రారంభించింది. ఈ సర్వీసుని ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ తదితరులు గురువారం ఉదయం లాంఛనప్రాయంగా ప్రారంభించారు. మరిన్ని విమాన సర్వీసులు తెచ్చే దిశగా ప్రయత్నిస్తామని ఎంపీలు చెప్పారు.

ఇప్పటికే హైదరాబాద్ మీదుగా ఢిల్లీ-విజయవాడ మధ్య ప్రతిరోజు ఒక సర్వీసు నడుస్తోంది. ఢిల్లీ నుంచి బ్యాంకాక్, బర్మింగ్‌హాం, ఫ్రాంక్‌ఫర్ట్, ఖాట్మండు, లండన్, మెల్‌బోర్న్, సిడ్నీ, ప్యారిస్, రోమ్, మిలన్‌లకు వెళ్లే విమానాలకు కనెక్ట్ అయ్యేందుకు కొత్త సర్వీసు దోహదం చేస్తుందని ఎయిర్ ఇండియా తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement