కారు - లారీ ఢీ: 20 మందికి గాయాలు | 20 people injured in road accident in vijayawada city | Sakshi
Sakshi News home page

కారు - లారీ ఢీ: 20 మందికి గాయాలు

Feb 19 2016 8:49 AM | Updated on Aug 30 2018 3:58 PM

నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

విజయవాడ : నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనం  ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది గాయాపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అలాగే బెంజి సర్కిల్ సమీపంలో బైక్పైకి ట్యాంకర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా.... మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement