శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటలు | 18 hours to the srivari darshanam | Sakshi
Sakshi News home page

శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటలు

Jun 27 2017 1:53 AM | Updated on Sep 5 2017 2:31 PM

వరుస సెలవులు రావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది.

వరుస సెలవులతో తిరుమలలో రద్దీ 
 
సాక్షి, తిరుమల: వరుస సెలవులు రావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. కల్యాణకట్ట, దర్శనం, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం.. ఇలా అన్ని చోట్లా భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 63,524 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. క్యూలైన్లలో ఉన్న  సర్వదర్శనం భక్తులకు 18 గంటలు, కాలిబాట భక్తులకు 15 గంటల తర్వాత స్వామివారి దర్శనం లభించనుంది.

అన్ని రిసెప్షన్‌ కేంద్రాల వద్ద ‘గదులు ఖాళీ లేవు’ అన్న బోర్డులే దర్శనమిస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తలనీలాలు సమర్పించే  కల్యాణకట్ట వద్ద కూడా భక్తులు కిక్కిరిసిపోయారు. ఆదివారం రికార్డు స్థాయిలో 50,422 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, సోమవారం కూడా అదే స్థాయిలోనే ఉంది. కాగా, శ్రీవారికి రూ.3.10 కోట్లు హుండీ కానుకలు లభించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement