ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన, దూరదృష్టి, ప్రణాళికలు చాలా బాగున్నాయని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్కుమార్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వచ్చినప్పుడు తనతో సుదీర్ఘంగా చర్చించారని, నవరత్నాల గురించి వివరించారని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యవసాయం, ఉద్యాన, రెవెన్యూ రంగాల్లో చేపట్టిన చర్యలు, వివిధ రంగాల్లో అవకాశాలపై రాజీవ్కుమార్ శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో కలసి ఉన్నతాధికారులతో సమీక్షించారు.