ప్రజలకు నిజమైన సంక్రాంతి వచ్చింది..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడితో నిజమైన రాష్ట్ర ప్రజలకు ముందుగానే సంక్రాంతి పండగ వచ్చిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో అమ్మ ఒడి పథకంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. సీఎం వైఎస్‌ జగన్‌ విద్యా దీవెన, విద్యా వసతితో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలు పేదలకు వరంగా మారాయని చెప్పారు. భావితరాలకు అమ్మ ఒడి పథకం ఎంతో మేలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top