టీఎస్‌పీఎస్సీ సవరణ నోటిఫికేషన్‌ నేడే! | TRT amendment notification today | Sakshi
Sakshi News home page

టీఎస్‌పీఎస్సీ సవరణ నోటిఫికేషన్‌ నేడే!

Dec 12 2017 7:03 AM | Updated on Mar 22 2024 11:27 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) మంగళవారం సవరణ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. తొలి నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా 31 జిల్లాలవారీగా కాకుండా... పాత 10 జిల్లాల ప్రకారం కేటగిరీల వారీగా పోస్టులు, రోస్టర్‌ కమ్‌ రిజర్వేషన్‌ వివరాలను ప్రకటించనుంది. వాస్తవానికి పది జిల్లాల ప్రకారం పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల మెమో జారీ చేసింది. దీనిపై టీఎస్‌పీఎస్సీకి లేఖ రాసింది. అయితే 31 జిల్లాల వారీగా ఇచ్చిన జీవోను హైకోర్టు తప్పుపట్టినందున.. ఇప్పుడు 10 జిల్లాల వారీగా భర్తీ కోసం జీవోనే ఇవ్వాల్సి ఉంటుందనే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి నిర్ణయానికి వచ్చారు. దీనిపై కడియం శ్రీహరి అధికారులతో మాట్లాడారు. అనంతరం సోమవారం రాత్రి జీవో జారీ అయింది. పాత పది జిల్లాల ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని అందులో టీఎస్‌పీఎస్సీకి సూచించారు. ప్రభుత్వం సూచించే అధికారి నియామక పత్రాలు అందజేస్తారని స్పష్టం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement