పట్టణంలో గత నెల 26న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన చెల్లూరి రాంబాబు మృతి కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. రాంబాబు భార్య క్రాంతి తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. రామచంద్రపురం సీఐ కొమ్ముల శ్రీధర్కుమార్ ఆయన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. తొలుత రాంబాబు మృతిపై అనుమానాస్పద కేసు నమోదు చేశారు.