నెల్లూరు జిల్లాలోనూ తీర ప్రాంత ప్రజలను ప్రభుత్వ అధికారులు అప్రమత్తం చేశారు. సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ఎప్పుడేం జరుగుతుందోనని తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాకాడు వద్ద సముద్రం దాదాపు 15 మీటర్లు ముందుకొచ్చింది. విడవలూరు వద్ద సముద్రంలో అలలు ఉధృతంగా ఉన్నాయి. తూపిలిపాలెం, కొత్తకోడూరు, మైపాడు, రామతీర్థం, తుమ్మలపెంటలోనూ సముంద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. మత్స్యకార ప్రాంతాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.
15 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం
Apr 28 2019 12:16 PM | Updated on Apr 28 2019 12:21 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement