కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్పై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. మోదీ ప్రభుత్వానికి ఆయన జై కొట్టారు. విద్యా, ఆరోగ్యం, వ్యవసాయం విషయంలో మోదీ ప్రభుత్వం చెప్పుకోదగిన కేటాయింపులు చేసిందని కొనియాడారు. ముఖ్యంగా జాతీయ ఆరోగ్య భద్రతా పథకం భేష్ అని నితీష్ అన్నారు. ఈ పథకం ద్వారా దేశంలో 10 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని ఇదో పెద్ద ముందడుగు అని నితీష్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తాను ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.
Feb 1 2018 2:59 PM | Updated on Mar 22 2024 11:29 AM
Advertisement