మధ్యప్రదేశ్‌లో ఎవరిది ‘పైచేయి’? | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌లో ఎవరిది ‘పైచేయి’?

Published Tue, Nov 27 2018 8:19 PM

 ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను సెమీ ఫైనల్‌గా రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్న నేపథ్యంలో వాటిల్లో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి జరగుతున్న ఎన్నికలను ‘టై–బ్రేకర్‌’గా పరిగణించవచ్చు. ఐదు రాష్ట్రాల్లో మిజోరమ్, చత్తీస్‌గఢ్‌లు చిన్న రాష్ట్రాలు కాగ, తెలంగాణ ఎన్నికలను ప్రాంతీయ యుద్ధంగానే భావించవచ్చు. రాజస్థాన్‌ పెద్ద రాష్ట్రమే అయినప్పటికీ రెండు దశాబ్దాల నుంచి కాంగ్రెస్, బీజేపీలే వరుసగా పంచుకుంటున్నాయి.

Advertisement
Advertisement