గౌరీ లంకేశ్‌ హంతకుల గుర్తింపు? | KN Govt says Gauri Lankesh killers identified | Sakshi
Sakshi News home page

గౌరీ లంకేశ్‌ హంతకుల గుర్తింపు?

Oct 3 2017 4:33 PM | Updated on Mar 21 2024 6:46 PM

సంచలనం రేపిన జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ హత్య కేసులో ప్రధాన నిందితులను గుర్తించామని కర్ణాటక ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక విచారణ బృందం(సిట్‌) బలమైన సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నమైనట్లు హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి మీడియాతో తెలిపారు. హంతకులెవరో మాకు తెలుసు. త్వరలో అన్ని విషయాలను వెల్లడిస్తాం అని ఆయన చెప్పారు. అయితే అందుకు సంబంధించి సరైన సాక్ష్యాలను సేకరించే పనిలో సిట్‌ బిజీగా ఉందని, ప్రస్తుతానికి మిగతా విషయాలను మీడియాకు వెల్లడించటం కష్టమని రామలింగా రెడ్డి చిక్‌ బల్లాపురాలో విలేకరులతో చెప్పారు. అదే సమయంలో సెప్టెంబర్‌ 9వ తేదీకి సంబంధం ఉందంటూ ఆయన వ్యాఖ్యానించటంతో ఆసక్తికర చర్చ మొదలైంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement