కిడ్నాపర్లు నన్ను ఏమీ అనలేదు, కొట్టలేదు

కిడ్నాపర్ల చెర నుంచి బయటపడ్డ జసిత్‌ పలు కీలక విషయాలు వెల్లడించాడు. నానమ్మతో కలిసి ఆడుకుంటుండగా ఎవరో వచ్చి తనను తీసుకెళ్లారని.. వేరే ఊరికి తీసివెళ్లి దాచిపెట్టారని తెలిపాడు. కిడ్నాపర్లలో ఒకరు తనకు తెలిసిన వ్యక్తే అని బాలుడు చెప్పినట్టు సమాచారం. ‘రాజు అనే వ్యక్తి తనను బైక్‌పై దించేసి వెళ్లాడు. తినడానికి రోజూ ఇడ్లీ పెట్టారు. కిడ్నాపర్లు నన్న ఏమీ అనలేదు. కొట్టలేదు. అందరికీ థాంక్స్‌’ అంటూ జసిత్‌ మీడియాతో చెప్పాడు. కాగా, నాలుగు రోజుల క్రితం జసిత్‌ను కిడ్నాప్‌ చేసిన దుండగులు గురువారం ఉదయం అనపర్తి మండలం కుతుకులూరు అమ్మవారి గుడివద్ద వదిలివెళ్లిన సంగతి తెలిసిందే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top