టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు (61) ఇక లేరు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ ఎర్రగడ్డలోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా హనుమంతరావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. 400 పైగా సినిమాల్లో హనుమంతరావు నటించారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఆయనకు రూ.2లక్షల ఆర్థికసాయం అందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం సహాయనిధి నుంచి రూ.5లక్షలు మంజూరుచేసిన విషయం తెలిసిందే.
Feb 19 2018 8:05 AM | Updated on Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement