ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియాలోకి ప్రవేశించారు. @ysjagan అనే ట్విట్టర్ హ్యాండిల్తో ఆయన డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ఇన్నాళ్లుగా ప్రజలతో మమేకం అవుతూ.. నేరుగా వారితోనే సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తున్న విపక్షనేత.. ఇప్పుడు నేరుగా సంప్రదించడానికి వీలుగా ట్విట్టర్ ఖాతాను తెరిచారు. యువతీ యువకులు, ఎన్నారైలు, ఇతరులు ఎవరైనా సరే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తమ అభిప్రాయాలు తెలియజేయడానికి, వివిధ అంశాలపై ఆయన తన మనోభావాలను పంచుకోడానికి వేదికగా ఈ ట్విట్టర్ ఖాతా ఉపయోగపడనుంది. బుధవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఈ ట్విట్టర్ అకౌంట్ యాక్టివేట్ అయ్యింది.
Feb 25 2015 7:22 PM | Updated on Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement