ఈ గండ శిలల గుండెల్లో ఖగోళం గుట్టు | The historic property of stone age in mahabubnagar district | Sakshi
Sakshi News home page

Oct 29 2016 12:33 PM | Updated on Mar 22 2024 11:31 AM

ప్రపంచాన్నే అబ్బురపరిచే అరుదైన చారిత్రక సంపదకు మహబూబ్‌నగర్ జిల్లా ముడుమాల వేదికైంది. వేల ఏళ్ల కిందే ఖగోళం గుట్టును గుర్తించే ‘ఖగోళశాస్త్ర పరిశోధనశాల (ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ)’కి కేంద్రంగా నిలిచింది. నిలువెత్తును మించిన గండ శిలలతో రుతుపవనాలు సహా వివిధ వాతావరణ అంశాలను గుర్తించే పరిజ్ఞానానికి సజీవ సాక్ష్యంగా నిలి చింది. ఆకాశంలో నక్షత్రాలను చూసి దిక్కులను, సమయాన్ని కచ్చితంగా గుర్తించేందుకు తోడ్పడే సప్తర్షి మండలాన్ని వేల ఏళ్ల కిందే చిత్రించిన విజ్ఞానం విశేషాలు తాజా పరిశోధనల్లో వెల్లడయ్యాయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత అరుదైన పురావస్తు ప్రాధాన్యమున్న ప్రాంతంగా ముడుమాల నిలుస్తోంది. ఇటీవల సెంట్రల్ వర్సిటీ బృందం పరిశోధన జరిపి ఇచ్చిన నివేదికతో పురావస్తు శాఖ కదిలింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement