ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా చేసిన ఘటన మరవక ముందే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు శుక్రవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిపై ఆయన గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్నా రాంబాబు ఇవాళ గిద్దలూరులో అనుచరులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.