జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహిస్తుండగా, మరో అవతరణ దినోత్సవం అవసరం లేదని హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన గురువారం జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యబద్దంగా విలీనమైంది ఈ రోజేనని నాయిని అన్నారు.