ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆదివారం ఉదయం పార్టీలో ఎలాంటి వివాదం లేదని చెప్పిన ములాయం సింగ్ యాదవ్.. సాయంత్రానికల్లా సంచలన నిర్ణయం తీసుకున్నారు. మీడియాతో సమావేశంలో ములాయం మాట్లాడుతూ తానే ఎస్పీ జాతీయ అధ్యక్షుడినని ప్రకటించారు. పార్టీలో తానే సుప్రీం అని, తాను చెప్పినట్టే అందరూ నడుచుకోవాలని స్పష్టం చేశారు. కుమారుడు అఖిలేష్ యాదవ్ యూపీ ముఖ్యమంత్రి మాత్రమేనని, సోదరుడు శివపాల్ యాదవ్ యూపీ పార్టీ చీఫ్గా కొనసాగుతారని చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్పై మరోసారి వేటు వేశారు. రాంగోపాల్ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కిరిస్తున్నట్టు ప్రకటించారు.
Jan 8 2017 7:06 PM | Updated on Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement