ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాంజాస్ కాలేజీ బుధవారం విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికింది. విద్యార్థులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో 20మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు. పలువరు జర్నలిస్టులకు కూడా గాయాలయ్యాయి. దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలిద్ను రాజాంస్ కాలేజీలో ఓ సాహిత్య కార్యక్రమంలో ఉపన్యసించేందుకు ఆహ్వానించడంతో గొడవ ప్రారంభమైంది.